తమిళనాడులో స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు విద్యార్థుల మృతి

  • కడలూర్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం
  • రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు
  • పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
  • ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
తమిళనాడులోని కడలూర్ సమీపంలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెమ్మన్‌కుప్పం రైల్వే క్రాసింగ్ వద్ద పాఠశాల విద్యార్థులతో వెళుతున్న వ్యాన్‌ను రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

విద్యార్థులతో కూడిన స్కూల్ వ్యాన్ సెమ్మన్‌కుప్పం వద్ద రైల్వే ట్రాక్‌ను దాటుతోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు వ్యాన్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ నుజ్జునుజ్జయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నంటాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన కడలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి కచ్చితమైన సంఖ్య తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tamil Nadu Train Accident
Tamil Nadu
School Van Accident
Cuddalore
Semmankuppam
Train Collision
Student Death
Road Accident India

More Telugu News